మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన భారీ మల్టీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రమోషన్స్ కూడా స్టెప్ బై స్టెప్ ఊపందుకుంటుండగా, ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఒక క్రేజీ టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
జూన్ 2న హైదరాబాద్లో గ్రాండ్గా జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్కు నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతారనే రూమర్ హాట్ టాపిక్గా మారింది. దీంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. కానీ నిజంగా బాలయ్య రావచ్చా? లేక ఇది కేవలం టాక్ వరకేనా? అనే డౌట్ కూడా అంతే స్పీడ్లో వినిపిస్తోంది.
బాలకృష్ణ – రామ్ చరణ్ మధ్య ఉన్న బాండింగ్ను చూసుకుంటే, వ్యక్తిగతంగా వస్తే ఆశ్చర్యం ఏమీ లేదు. అంతేకాదు, ‘వీర సింహారెడ్డి’ నుంచి ‘పెద్ది’ వరకూ సంబంధం ఉన్న మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ లాంటి నిర్మాణ సంస్థల కనెక్షన్ కూడా ఈ రూమర్కు బలం ఇస్తోంది. పైగా బాలయ్య ప్రస్తుతం చేస్తున్న 111వ సినిమా కూడా ఇదే బ్యానర్లతో ఉండటంతో, ఆ కోణంలోనూ అవకాశాన్ని కొట్టిపారేయలేం.
అయితే ఇవన్నీ ఊహాగానాలే. ఈ క్రేజీ కాంబినేషన్ స్టేజ్పై కనిపిస్తుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే మేకర్స్ నుంచి వచ్చే అధికారిక క్లారిటీ కోసం కొంచెం ఆగాల్సిందే. అప్పటివరకు ‘పెద్ది’ హైప్ మాత్రం తగ్గేలా లేదు.
