అల్లకల్లోలంగా కొనసాగుతున్న జగన్ పాలన

అల్లకల్లోలంగా కొనసాగుతున్న జగన్ పాలన

ఆంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పాలన కాస్త అల్లకల్లోలంగా కొనసాగుతున్న విషయం సుస్పష్టంగా కనిపిస్తుంది.అదే సమయంలో జగన్ తాను అనుకున్న పలు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కడా తగ్గకుండా కాస్త హై ఎండ్ గానే పూర్తి చేస్తున్నారు.ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో కీలకమైన పథకాలను అమలులోకి తీసుకురావడమే కాకుండా వాటికి మరింత అద్భుతమైన సవరణలు చేకూర్చుతున్నారు.అయితే వైసీపీ ప్రభుత్వం కానీ జగన్ కానీ చేస్తున్న పనులలో ప్రతీ చిన్న తప్పును కాదు పొరపాటును జనసేన పార్టీ శ్రేణులు ఎత్తి చూపుతున్నారు.

తాజాగా జగన్ ప్రవేశ పెట్టిన “జగనన్న గోరుముద్ద” పథకం తో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకి వారి రోజువారీ మెనులలో మార్పులు చేసి మంచి ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే రాష్ట్రం అంతటా అమలులో ఉండే ఈ పథకంలో ఒక్క చోటున అయినా పొరపాటు జరగదా ఇప్పుడు అలాంటి చిన్న చిన్న పొరపాట్లను పట్టుకొని ఎంతసేపు వైసీపీనే టార్గెట్ చెయ్యాలి అన్నట్లుగా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పస విమర్శల మూలాన వాళ్లకి రాక్షసానందం తప్ప వైసీపీకు మచ్చు తునకంత నష్టం కూడా వాటిల్లదని వారు గుర్తుంచుకోవాలి.