రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్లు

రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్లు

ఏపీ మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రాజధాని అనుబంధ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.. ఇంప్లీడ్ అవుతామని దాఖలు చేసిన పిటిషన్లు డిస్మిస్ చేసింది. రాజధాని ప్రధాన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరుపుతోంది.. నేరుగా విచారణకు కొందరు న్యాయవాదులకు అనుమతి ఇవ్వగా.. ఆన్‌లైన్ ద్వారా వాదనలు వినిపించేందుకు మిగతావారికి అనుమతి ఇచ్చారు. రాజధాని పిటిషన్లకు సంబంధించి ఏపీ హైకోర్టులో తుది విచారణ జరుగుతోంది.

విశాఖలో గెస్ట్ హౌస్‌కి సంబంధించి, ప్రభుత్వం క్యాంప్ ఆఫీస్ కోసం గతంలో ఇచ్చిన అఫిడవిట్‌పై కూడా విచారణ జరిగింది. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మిస్తున్నారని చెప్తున్నా.. ఇది తొందర్లోనే క్యాంప్ ఆఫీస్గా మారిపోతుందనే అనుమానాలు రాజాధాని ప్రాంత రైతులు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ గెస్ట్ హౌస్ పై, పూర్తి స్థాయి ప్రణాళిక, ప్లాన్ మొత్తం తమ ముందు ఉంచాలని కోర్టు తెలిపింది. ఇక్కడ గెస్ట్ హౌస్ నిర్మాణం భారీ స్థాయిలో నిర్మిస్తున్నారని.. ఇది రాజధాని తరలింపులో భాగం అంటూ రైతులు కోర్టుకు చెప్పారు.

దీంతో విశాఖ గెస్ట్‌హౌస్ ప్లాన్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పరిపాలన రాజధానిలో భాగంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నిర్మిస్తే పిటిషనర్లు తమ దృష్టికి తీసుకురావొచ్చని హైకోర్టు తెలిపింది. అప్పుడు దీనిపై వాదనలు వింటామని పిటిషనర్‌కు కోర్టు చెప్పింది. మిగిలిన పిటిషన్లపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఏపీ మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.. వీటి అన్నింటిని కలిపి విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. రోజు వారీగా విచారణ జరుపుతోంది.