స్కంద డైలాగ్ లు తో పొలిటికల్ హీట్… బోయపాటి ఎవరిని టార్గెట్ చేశారు..?

స్కంద డైలాగ్ లు తో పొలిటికల్ హీట్… బోయపాటి ఎవరిని టార్గెట్ చేశారు..?
Latest News

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా స్కంద మూవీ రాబోతుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ మూవీ లో రామ్ సరసన శ్రీ లీల నటించబోతోంది. సెప్టెంబర్ 28న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతోంది. తాజాగా మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. యాక్షన్ సన్నివేశాలతో పవర్ ఫుల్ డైలాగ్స్ తో కొత్త ట్రైలర్ కూడా వచ్చేసింది . అది కూడా చాలా అద్భుతంగా ఉంది. రెండు షేడ్స్ లో రామ్ అద్భుతంగా నటించారు. విశ్వరూపాన్ని చూపించారు. డైలాగులు అయితే అదిరిపోయాయి.

స్కంద డైలాగ్ లు తో పొలిటికల్ హీట్… బోయపాటి ఎవరిని టార్గెట్ చేశారు..? - Telugu Bullet

కానీ ట్రైలర్ లోని డైలాగులు మాత్రం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులకి అద్దం పట్టేటట్టు ఉన్నాయి అని అంతా భావిస్తున్నారు. ”మేము కోడిని పొట్టేలునే కాదు మాకు ఎదురొస్తే దేన్నైనా పచ్చడి పెట్టేస్తాం . మనిషికో పేరు ఊరుకో గౌరవం అని . ప్రతి పదవికి ఒక బాధ్యత ఉంటది అది మర్చిపోయి మీరందరూ తీసిన పరువు, కూల్చేసిన ఆత్మగౌరవం తిరిగి మీరే నిలబెట్టాలి” అని పెట్టిన డైలాగ్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ఏపీకి చెందిన ఒక రాజకీయ నాయకుడిని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.