Political Updates: ప్రజాదర్బార్ ను ప్రారంభం… అర్జీలను స్వీకరించిన సీఎం రేవంత్

Political Updates: Prajadarbar started... CM Revanth received petitions
Political Updates: Prajadarbar started... CM Revanth received petitions

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ ను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్ వద్దకు చేరుకున్న ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. శుక్రవారం నుంచి ప్రజాదర్బార్ (Praja Darbar)ను ప్రారంభించనున్నట్లు గురువారం తన ప్రమాణస్వీకారం అనంతరం సీఎం రేవంత్ ప్రకటించారు.

దీంతో నేడు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. క్యూలైన్లలో ఉన్న ప్రజల నుంచి వినతిపత్రాలను సీఎం స్వీకరించారు. అర్జీలను పరిశీలించి వారి సమస్యలను రేవంత్ అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయానికి సీఎం వెళ్లనున్నా రు. విద్యుత్ శాఖపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.