లెక్చరర్ వేధింపులు తట్టుకోలేక పాలిటెక్నిక్‌ విద్యార్థి మృతి

లెక్చరర్ వేధింపులు తట్టుకోలేక పాలిటెక్నిక్‌ విద్యార్థి మృతి

మీర్‌పేట్‌లోని తీగల రాంరెడ్డి (టీఆర్‌ఆర్‌) కాలేజీలో విషాదం చోటేచేసుకుంది. పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ చదుతున్న సంధ్య అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. కాలేజీ యాజమాన్యం బెదిరింపుల వల్లనే సంధ్య బలవన్మరణానికి పాల్పడిందని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీ గేటు వద్ద ధర్నా నిర్వహించారు. సంధ్య ఆత్మహత్యకు లెక్చరెర్ స్వాతి వేధింపులే కారణమని ఆరోపిస్తున్నారు. వెంటనే లెక్చరెర్ స్వాతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. తమకు న్యాయం చేయాలంటూ కాలేజీ గేటు ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. డిటెండ్‌ చేస్తామని కాలేజీ యాజమాన్యం బెదిరిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.