సింగిల్ షాట్ కు రూ.2 కోట్లు ఖర్చు

సింగిల్ షాట్ కు రూ.2 కోట్లు ఖర్చు

బాహుబలి సినిమా ద్వారా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. బాహుబలి తరువాత సుజీత్ దర్శకత్వంలో వచ్చిన సాహో ప్లాఫ్ అయినా కానీ దాదాపు ఈ సినిమా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళను సాధించి రికార్డ్ సృష్టించింది. అయితే ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కాబోతుంది.అయితే ఈ చిత్రం ప్రస్తుతం జార్జియాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటికొచ్చింది. కీలకమైన యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా సింగిల్ షాట్ కు రూ.2 కోట్లు ఖర్చు చేశారని, ఈ సినిమాలో ఈ సీన్ హైలైట్ కాబోతుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ వారం జార్జియా షెడ్యూల్ పూర్తికావడంతో తదుపరి షూటింగ్ కోసం చిత్ర యూనిట్ యూరప్ బయలుదేరబోతుంది.