ఆలా రాయటం దారుణం .. ఆవేదన వ్యక్తం చేసిన యాంకర్ ప్రదీప్

తాజాగా న్యూస్ లోను మరియు సోషల్ మీడియా లోను చూస్తున్నాం ఒక యువతి ఫై 139 మంది ఐదువేల సార్లు అత్యాచారం చేశారంటూ ఓ యువతి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ యువతి చేసిన ఫిర్యాదు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. అయితే, యువతి ఇచ్చిన ఫిర్యాదులో యాంకర్ ప్రదీప్ మాచిరాజు పేరు కూడా ఉంది. దీంతో ప్రదీప్‌‌పై మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఆయన్ని నిందిస్తూ సోషల్ మీడియాలో చాలా మంది ట్రోలింగ్ మొదలుపెట్టారు. అలాగే, యూట్యూబ్‌లోనూ వీడియోలు పోస్ట్ చేశారు. వీటిపై గురువారం ప్రదీప్ స్పందించారు.

సోషల్ మీడియాలో, పలు యూట్యూబ్ ఛానెళ్లలో తనపై వస్తోన్న ఆరోపణలు బాధాకరం అని ప్రదీప్ అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా, అదే నిజమని నమ్ముతూ తనపై రకరకాల ఆర్టికల్స్ రాయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అంశంలో తన పేరు ఎందుకుందో కూడా ఆలోచించకుండా యాంకర్ ప్రదీప్ పేరు కనిపించగానే ఇష్టమొచ్చినట్టు రాసేస్తున్నారని మండిపడ్డారు. అవతల వ్యక్తులు ఏ ఉద్దేశంతో చెప్పారో.. ఎవరు చెప్పించారో ఆలోచించకుండా టార్గెట్ చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, దారుణమైన భాష వాడటం ఎంతగానో బాధ కలిగిస్తోందని ప్రదీప్ అన్నారు.

‘ఒక వ్యక్తికి న్యాయం చేయడం కోసం ఇంకో వ్యక్తి జీవితం నాశనం చేసేస్తారా?’’ అని ప్రదీప్ ప్రశ్నించారు. ఈ రూమూర్స్ వల్ల నిజం తెలిసే లోపల తనకు గానీ, తన ఫ్యామిలీకి గానీ ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. . దీని వెనుక ఎవరెవరు ఉన్నారో వాళ్లందరినీ బయటికి లాగుతానని ప్రదీప్ హెచ్చరించారు. అలాగే, తనపై ఇష్టమొచ్చినట్టు రాతలు రాసేవారిపై, కామెంట్లు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.

https://youtu.be/cfjc5WFpuLE