కరోనా బారిన పడి యువతి మృతి

కరోనా బారిన పడి యువతి మృతి

కాన్పు కోసం తల్లిగారింటికి వచ్చిన ఓ యువతి కరోనా బారిన పడి మృతిచెందింది. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం దామరవంచలో శనివారం ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. ధరావత్‌ కొమ్మాలు, కాళీ దంపతులకు కూతురు సరిత (23)కు ఏడాది క్రితం ఖానాపురం మండలం ధర్మారావుపేటకు చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు.

మొదటి కాన్పు కోసం 20 రోజుల క్రితం సరితను ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో కొమ్మాలు, కాళీ దంపతులకు కరోనా సోకింది. కొడుకు దివాకర్‌తోపాటు కూతురు సరితకూ వైరస్‌ సోకింది. దీంతో వారంతా మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వైద్యుల సూచన మేరకు సరితను హన్మకొండ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ ఓ పాపకు జన్మనిచ్చింది. 3 రోజుల క్రితం ఆ పాప, శనివారం సరిత మృతిచెందారు.