ఈనెల 30న మహబూబ్ నగర్ కు రానున్న ప్రధాని మోడీ..!

National Politics: Prime Minister's key instructions at the time of inauguration of Ayodhya Ramaya statue
National Politics: Prime Minister's key instructions at the time of inauguration of Ayodhya Ramaya statue

భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కాస్త ముందుకు వెళ్లింది. అక్టోబర్ 2వ తేదీ అనుకున్నప్పటికీ.. ఇప్పుడు ఆ టూరు ముందుకు జరిగింది. సెప్టెంబర్ 30 తేదీనే తెలంగాణకు వస్తున్న మోడీ.. మహబూబ్ నగర్ లో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 30న మహబూబ్ నగర్ టౌన్ లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు మోడీ హాజరుకానున్నారు. 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. 30 తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోడీ సభకు చేరుకోనున్నారు.

ప్రధాని సభను 2023 ఎన్నికల శంఖారావం సభగా బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. బహిరంగ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నాయకులు.. కనీసం లక్ష మందిని సభకు తరలించేలా జన సమీకరణపై ధృష్టిపెట్టారు. సభ ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర నేతలు జితేందర్ రెడ్డి, ఆచారి పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీని గ్రామాల్లోకి తీసుకువెళ్లి.. ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరును, కాంగ్రెస్ గ్యారెంటీలపై విమర్శలు చేస్తూ.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.