భారత్ కు రానున్న ప్రిన్స్ ఆఫ్ వేల్స్

భారత్ కు రానున్న ప్రిన్స్ ఆఫ్ వేల్స్

రాణి ఎలిజబెత్‌ 2 తనయుడు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అధికారికంగా భారత్‌లో రెండు రోజుల పాటు పర్యటించ బోనున్నారు. ఇది చార్లెస్‌కి 10వ అధికారిక భారత పర్యటన. ప్రిన్సెస్‌ డయానా భర్తఅయిన చార్లెస్ నవంబర్‌ 13న భారత రాజధాని న్యూఢిల్లీకి వస్తున్నారని తెలిపారు.

చివరిసారిగా రెండేళ్ల క్రితం తన రెండో భార్య కెమిల్లాతో కలిసి నవంబర్‌ 2017 లో భారత్‌కు వచ్చారు. చార్లెస్‌ కార్యాలయ వర్గాలు వాతావరణ మార్పులు, సోషల్‌ ఫైనాన్స్‌ ఇంకా సుస్థిర మార్కెట్లు మొదలగు అంశాలను దృష్టిలో పెట్టుకుని రానున్నట్లు తెలిపాయి.

బ్రిటన్‌ యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌తో వాణిజ్య ఒప్పందంకి బ్రిటన్‌ ఆసక్తిగా ఉంది.