బయోపిక్ తో హిట్ కొట్టిన బాలీవుడ్ తార

బయోపిక్ తో హిట్ కొట్టిన బాలీవుడ్ తార

ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్ నటించిన హిందీ చిత్రం”ది స్కై ఈజ్ పింక్” ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షొనాలీబోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఒక్క నెగిటివ్ పాయింట్ లేదు అని సినిమా చాలా బాగుందని మంచి టాక్ ని అందుకుంటుంది. పాజిటివ్, నెగిటివ్ టాక్స్ ఏ సినిమాకైనా ఉంటాయి. అయేషా చౌదరి జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి అమెరికాలోనూ మంచి టాక్ అందుకుంది. మోటివేషనల్ స్పీకర్ అయేషా చౌదరి పల్మనరీ ఫైబ్రోసిస్ అనే వ్యాధితో బాధపడుతూ చనిపోయింది.

తల్లిదండ్రుల ప్రభావం తన జీవితంపై ఎలా ఉంది అనే విషయమే తెరకెక్కించారట.ప్రతీ తల్లిదండ్రులకు ఈ సినిమాకు అంకితంచేస్తూ ప్రేక్షకులు కొనియాడుతున్న ఈ చిత్ర సహ నిర్మాతగా ప్రియాంక పనిచేశారట. ఆస్కార్‌కు నామినేట్ అయ్యే సత్తాఉన్న చిత్రాలనే తీసే దర్శకురాలు షొనాలి బోస్.ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన ఈ చిత్రం చాలా కాలం తర్వాత హిందీలో నటించిన ప్రియాంకకి మంచి పేరు తెచ్చిపెడుతుంది.