ప్రియుడి పై మోజులో ఇంతటి దారుణం చేసిందా?

ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకొన్న ఓ వివాహిత భర్తను అతిదారుణంగా నరికి చంపిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. అయితే ప్రియుడి మోజులో పడి భర్త ప్రాణాలు తీసి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతోంది. అసలు ఏం జరిగింది అంటే.. ఢిల్లీలోని జేలార్ వాలాబాగ్ ప్రాంతానికి చెందిన శరత్ దాస్, అనిత పెళ్లి చేసుకొని కాపురం ఉంటున్నారు. ఏదో సమయంలో ఎదురింట్లో ఉండే సంజయ్ అనే యువకుడిపై ఆ ఆంటీకి మోజు పడింది. దాంతో కొంతకాలం పాటు అనిత నిరాటంకంగా భర్త కళ్లు గప్పి అతడితో పనులు నెరపుతుండేది.

అయితే రోజూ భర్త బయటకు వెళ్లిపోగానే ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని రాసకార్యాలను నడిపేది. మొత్తానికి వారి గుట్టుకు పసిగట్టిన భర్త శరత్ దాస్ భార్యను పలుమార్లు హెచ్చరించాడు. దీంతో తన సుఖానికి భర్త అడ్డొస్తున్నాడని భావించిన అనిత అతడిని ఏకంగా చంపేసేందుకు ప్లాన్ చేసింది. తాజాగా ఓ రాత్రి భర్త నిద్రపోతున్న సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచించి భర్త మొహానికి దుప్పటి చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత భర్త అనారోగ్యంతో చనిపోయినట్లు అందరినీ నమ్మించింది. అయితే పోస్ట్ మార్టం నివేదికలో మాత్రం అతడిని ఊపిరాడకుండా చేసి చంపినట్లు తేలింది. దీంతో పోలీసులు అనితను ప్రశ్నించారు. ఏం చేస్తుంది చేసేదగి లేక ఆమె తన భర్తను ప్రియుడి సాయంతో తానే చంపేసినట్లు ఒప్పేసుకుంది. కాగా పోలీసులు అనిత, సంజయ్‌పై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.