నిర్మాత డివివి దానయ్య కి కరోనా వైరస్ పాజిటివ్

నిర్మాత డివివి దానయ్య కి కరోనా వైరస్ పాజిటివ్

సామాన్య ప్రజల నుండి, ప్రజా ప్రతినిదులకి, సినీ ప్రముఖులకి కరోనా వైరస్ మహమ్మారి సోకుతుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, సెలబ్రిటీ లు, ప్రజా ప్రతి నిధులు కరోనా వైరస్ భారిన పడగా, తాజాగా ఈ జాబితా లోకి రౌద్రం రణం రుధీరము చిత్రం నిర్మాత డివివి దానయ్య కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజా గా కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతూ ఉన్న దానయ్య, కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్ట్ లో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.

ఇప్పటికే చిత్ర దర్శకుడు రాజమౌళి సైతం కరోనా వైరస్ భారిన పడ్డారు. ఈ విషయాన్ని ఇటీవల సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మైల్డ్ కరోనా వైరస్ పాజిటివ్ అని, కోలుకున్న అనంతరం ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నా అని రాజమౌళి అన్నారు. అయితే ఇపుడు తాజాగా ఆ చిత్ర నిర్మాత కరోనా వైరస్ భారిన పడటం తో సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.