సుజిత్ వర్కింగ్ స్టైల్ కు ఇంప్రెస్ అయిన నిర్మాతలు

సుజిత్ వర్కింగ్ స్టైల్ కు ఇంప్రెస్ అయిన నిర్మాతలు

ఫ్లాపులు, విమర్శలు వస్తే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కుంగిపోతాడు. తర్వాతి సినిమా విషయంలో తర్జనభర్జనలు పడుతుంటాడు. కానీ సుజిత్ మాత్రం అందుకు భిన్నంగా వెళ్తున్నాడు. సాహో ఫ్లాప్ ని మరిపించడానికి మెగా పవర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు సుజిత్.సాహో తర్వాత సుజిత్ పై చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ప్రభాస్ ఇమేజ్ ని హ్యాండిల్ చేయలేకపోయాడని. నిర్మాతలతో భారీగా ఖర్చు చేయించాడని విమర్శలు చేశారు నెటిజన్లు. అంతేకాదు ఈ ఫ్లాప్ తో సుజిత్ పనైపోయిందనే కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే కొన్నాళ్లుగా వేధిస్తోన్న ఈ కామెంట్స్ కు మెగా రిప్లై ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు సుజిత్.

సుజిత్ తర్వాత రామ్ చరణ్ కోసం కథ రాస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఆల్ రెడీ డిస్కషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయని చెబుతున్నారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత సుజిత్ సినిమా మొదలుపెట్టే అవకాశముందట. ఇక సాహో నిర్మాతలు యూవీ క్రియేషన్స్ వాళ్లే ఈ చిత్రాన్ని నిర్మిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

సాహో సినిమాకు బ్రేక్ ఈవెన్ రాకపోయినా.. నిర్మాతలు మాత్రం సుజిత్ వర్కింగ్ స్టైల్ కు ఇంప్రెస్ అయ్యారు. అందుకే సుజిత్ కు మరో సినిమా ఇస్తున్నారని సమాచారం. ఇక రామ్ చరణ్ కు యువి క్రియేషన్స్ తో మంచి రిలేషన్ ఉంది. ఈ ఫ్రెండ్ షిప్ తోనే సుజిత్ బ్యాక్ గ్రౌండ్ గురించి పట్టించుకోకుండా.. చరణ్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడట. మరి బాహుబలి తర్వాత సాహో అన్న ప్రభాస్ కు భారీ బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోయిన సుజిత్, చెర్రీ కోసం ఎలాంటి కథ సిద్ధం చేశాడో చూడాలి. మొత్తానికి సుజిత్.. సాహో ఫ్లాప్ మార్క్ ను తనపై లేకుండా చేసుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. సరికొత్త కథతో రామ్ చరణ్ తో సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడనే వార్తలొస్తున్నాయి.