హీరో శివాజీ మీద పృధ్వీ సంచలన వ్యాఖ్యలు…!

Prithviraj Sensational Comments On Hero Shivaji

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాల ఓటు బ్యాంకును గల్లంతు చేసేందుకు టీడీపీ నేతలు యత్నిస్తున్నారని నటుడు పృథ్వీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి వైసీపీ కుట్రలు చేయాల్సిన అవసరం లేదని ఎందుకంటే ప్రజాబలం వైసీపీకి పుష్కలంగా ఉందన్నారు. త్వరలోనే ఆధార్-ఓటర్ కార్డు అనుసంధానంపై సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రకు సంబంధించి తన వద్ద ఫైలు ఉందని నటుడు శివాజీ చెప్పడాన్ని తప్పుపట్టిన పృథ్వీ తన వద్ద కూడా ఓ ఫైలు ఉందని వ్యాఖ్యానించారు. శివాజీ ప్రెస్ మీట్లలో మీసాలు తిప్పుతున్నాడనీ, నా వెంట్రుక కూడా పీకలేరు అని మాట్లాడుతున్నాడనీ, ఇది హుందాతనం కాదని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం, దివాకర్ ట్రావెల్స్ ప్రమాదం సమయంలో శివాజీ మాటలు విని ‘బాబోయ్.. ఇతను మామూలు లీడర్ లాగా లేడు’ అని భావించానని పృథ్వీ వెల్లడించారు. కానీ ఆ తర్వాత తెల్లవారి లేచిన దగ్గర నుంచి టీడీపీ మీటింగుల్లో మాట్లాడుతూ చంద్రబాబు నంది అంటే నంది, పంది అంటే పంది శివాజీ అంటున్నారని విమర్శించారు.