సినిమాలు వదిలేస్తున్న రజినీకాంత్.. ఆ డైరెక్టర్‌తో ఫైనల్ ప్రాజెక్ట్!

సినిమాలు వదిలేస్తున్న రజినీకాంత్.. ఆ డైరెక్టర్‌తో ఫైనల్ ప్రాజెక్ట్!
రజినీకాంత్

సౌత్ ఇండియాలో సూపర్‌స్టార్‌గా వెలుగులోకి వచ్చినా నటుడు రజినీకాంత్. ప్రస్తుతం ‘జైలర్’ చిత్ర షూటింగ్ ని ఫినిష్ చేశారు. దీని తర్వాత మరో రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగా తన చివరి చిత్రం ఇదేనంటూ కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి .ఐదు దశాబ్దాలుగా వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ యాక్టింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నిజానికి రజినీ ఇంతకు ముందు పాలిటిక్స్‌లో ఎంటరై, మరల సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నారు. కానీ ఆరోగ్యం సహకరించక పోవడం కారణంగా రాజకీయాల ఆలోచన విరమించుకున్నారు.. అయితే రజినీ కాంత్ త్వరలోనే సినిమా నుంచి తప్పు కుంటారని తమిళ దర్శకుడు మిస్కిన్ రిసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు మిస్కిన్ ఈ విధంగా ప్రకటించినప్పటికీ రజినీకాంత్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

సినిమాలు వదిలేస్తున్న రజినీకాంత్.. ఆ డైరెక్టర్‌తో ఫైనల్ ప్రాజెక్ట్!
రజినీ కాంత్

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీ నటించిన ‘జైలర్’ మూవీ ఈ ఏడాది ఆగస్ట్ 11న విడుదల కానుంది. అలాగే తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన ‘లాల్ సలామ్‌’ చిత్రంలోనూ రజినీ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ‘విక్రమ్’ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో రజినీ 171వ చిత్రం ఉండనుందని తెలిపిన మిస్కిన్.. ఇదే ఆయన చివరి చిత్రం కావచ్చని వెల్లడించాడు.