మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన ‘పెద్ది’ ఈ ఏడాది టాలీవుడ్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తర్వాత చరణ్ తదుపరి ప్రాజెక్ట్పై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ‘పెద్ది’ తర్వాత చరణ్ తన తదుపరి సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్తో చేయనున్న సంగతి తెలిసిందే.
‘రంగస్థలం’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత మరోసారి రామ్ చరణ్–సుకుమార్ కాంబినేషన్లో సినిమా రాబోతుండటంతో ఈ ప్రాజెక్ట్పై భారీ హైప్ నెలకొంది. అయితే ఇంతకాలం ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంలో నెలకొన్న సస్పెన్స్కు తాజాగా తెరపడినట్లు తెలుస్తోంది.
మేకర్స్ ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా ముహూర్త కార్యక్రమాలతో గ్రాండ్గా లాంచ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ను అఫీషియల్గా ప్రారంభించేందుకు మరెంతో సమయం లేదని చెప్పొచ్చు.
ఇక ఈ సినిమాను సుకుమార్ తనదైన స్టైల్లో భారీ స్కేల్లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ను నిర్మించనున్నారు. కాగా, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
రామ్ చరణ్–సుకుమార్ కాంబినేషన్పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో.. ఈ సినిమా ఎలాంటి కథతో, ఏ స్థాయిలో తెరకెక్కనుందనేది ఆసక్తికరంగా మారింది.






