‘మళ్లీ పెళ్లి’ సినిమాను ఆపాలంటూ కోర్టును ఆశ్రయించిన రమ్య రఘుపతి..

‘మళ్లీ పెళ్లి’ సినిమాను ఆపాలంటూ కోర్టును ఆశ్రయించిన రమ్య రఘుపతి..
రమ్య రఘుపతి

నటుడు నరేశ్ మరియు నటి పవిత్ర లోకేష్ ఈ మధ్య సోషల్ మీడియాలో తరుచు కనిపిస్తున్నారు, కారణం వాళ్ళు ఇద్దరు మెయిన్ లీడ్ లో తెరకెక్కిన చిత్రం మల్లి పెళ్లి అని అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించగా.. నటుడు వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకోగా.. కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి పెద్ద షాక్ ఇచ్చారు నరేష్ భార్య రమ్య రఘుపతి. ఈ సినిమాలో తన ప్రతిష్టను కించిపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆమె పేర్కొన్నారు.