నల్గొండ: ప్రేమ పెళ్లి పేరుతో యువతిపై హత్యాచారం.. కాపలా కాసిన తల్లి..!

Nalgonda Rape Case
Nalgonda Rape Case
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని బంధువులే దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అత్యాచారం జరుగుతున్న సమయంలో నిందితుడి తల్లి రక్షణగా నిలవడం దిగ్భ్రాంతి కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టలగడ్డతండాకు చెందిన రూపావత్ నాగు నాయక్ (22)కి రెండేళ్ల క్రితం అదే మండలానికి చెందిన యువతి (19)తో పరిచయం ఏర్పడింది. హైదరాబాద్‌లో కాలేజీకి వెళ్తున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది.
ఆ సమయంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని నాగు గర్భవతిని చేశాడు. ఆ తర్వాత అబార్షన్ చేయించటంతో పాటు పెళ్లి ప్రస్తావన తీసుకురావటంతో మెుహం చాటేశాడు. దీంతో యువతి వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నాగుపై అప్పట్లో పోక్సోచట్టం కింద కేసు పెట్టి జైలుకు పంపించారు. అనంతరం కొంత కాలం దూరంగా ఉన్న నాగు.. ఆ తర్వాత ఆమెకు మళ్లీ ఫోన్ చేయటం మెుదలు పెట్టాడు. మేజర్‌ కాగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను రెండోసారి గర్భవతిని చేశాను. ఈసారి కూడా బలవంతంగా గర్భస్రావం చేయించటంతో పాటు పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే మెుహం చాటేశాడు.
దీంతో ఈ నెల 14వ తేదీన ఆ యువతి పూతరాగాతండాలోని శ్రీ నాగ్ ఇంటికి విషయం తేల్చుకునేందుకు వెళ్ళింది. తన కొడుకుపై కేసు పెట్టి నాగ్ ను జైలుకు పంపారని నాగ్ తల్లి తనపై కక్ష పెంచుకుంది. ఆ యువతిని హత్య చేయాలని ప్లాన్ చేశాడు. పెళ్లి గురించి మాట్లాడుకుంటామని చెప్పి తండా శివార్లలోని పొలానికి ఆమెను తీసుకెళ్లాడు. సూర్యాపేట జిల్లా కోతండాకు చెందిన అతని బావమరిది క్రాంతి కుమార్‌ను తన కుమారుడు నాగ్ నాయక్‌తో కలిసి అక్కడికి పిలిపించారు. అనంతరం నాగ్, క్రాంతి కుమార్‌లు యువతిని సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ తర్వాత గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు.
ఆత్మహత్య చేసుకుందని నమ్మించేందుకు ఓ యువతి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు. యువతిపై అత్యాచారం చేసి హత్య చేస్తుండగా నాగు బుజ్జి తల్లి రోడ్డుకు కాపలాకాయడం గమనార్హం. బాలిక అదృశ్యం కావడంతో ఆమె తల్లిదండ్రులు వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బుజ్జి సహాయంతో నాగు, క్రాంతికుమార్ యువతిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కుమారుడు ఓ ఆడ పిల్లను రేప్ చేసి హతమార్చుతుంటే తల్లి కాపలాగా ఉండటం విస్మయానికి గురి చేసింది.