ఓటీటీ ద్వారా లక్ష్మీబాంబ్ రిలీజ్ కు రెడీ.. !

సినీ పరిశ్రమకు లాక్‌డౌన్ పెద్ద తలకాయ నొప్పిగానే పరిణమించింది. నెలల తరబడి లాక్ డౌన్ లో ఉండటంతో పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీనిపై నిర్మాత‌లకి దిక్కు తోచ‌ని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. భారీ బ‌డ్జెట్‌తో సినిమాలు రెడీ అయినా.. ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫాంల వైపు నిర్మాతల చూపు పడుతోంది. ఇప్ప‌టికే తెలుగులో అమృత‌రామ‌మ్ రిలీజ్ కాగా.. అనుష్క నిశ్శ‌బ్దం సినిమాను కూడా ఓటీటీ ద్వారానే రిలీజ్ చేస్తార‌నే టాక్ వినిపిస్తుంది. లాక్‌డౌన్ తో థియేట‌ర్స్ బంద్ కావ‌డంతో కాల‌క్షేపం కోసం ప్ర‌జ‌లు ఓటీటీల‌నే ఆశ్ర‌యిస్తున్నారు.

అంతేకాకుండా ఓటీటీ సంస్థలకు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. అందుకు తోడు అంతకుమించిన భారీ వ్యూయర్ షిప్ అందుతోంది. దీంతో న‌ష్టాల‌నుండి తేరుకొనేందుకు నిర్మాత‌లు ఓటీటీల‌ వైపు దృష్టి సారిస్తున్నారు. కాగా అక్ష‌య్ కుమార్ న‌టించిన ల‌క్ష్మీ బాంబ్ సినిమా డిస్నీ హాట్ స్టార్స్ లో రిలీజ్ కావ‌డం ప‌క్కా అయిపోయిందనే టాక్ బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తెలుగు కాంచ‌న సినిమాకి రీమేక్‌గా ల‌క్ష్మీబాంబ్ తెర‌కెక్క‌గా.. ఈ చిత్రం ఎడిటింగ్‌.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇవి పూర్తి అయిన వెంటనే ఓటీటీలో రిలీజ్ చేస్తార‌ని వినికిడి. ఇప్ప‌టికే హీరో అక్షయ్‌, నిర్మాత తుషార్‌ కపూర్‌, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ ప్రతినిధి విజయ్‌ సింగ్‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని.. దాదాపు కోట్ల‌కి డీల్ కుద‌ర‌డంతో సినిమాని ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమ్ చేసేందుకు రెడీ అయ్యారనే టాక్స్ విపరీతంగా వైరల్ అవుతోంది.