పరువు తీసుకున్న హీరోయిన్

పరువు తీసుకున్న హీరోయిన్

సెలెబ్రిటీలు చేసే యాడ్స్ ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. రెండు చేతులా డబ్బు సంపాదిస్తున్నా కూడా ఇలా ఆహార ఉత్పత్తులు, ఇతర ప్రొడక్ట్‌లకు స్టార్స్ అంబాసిడర్‌గా ఉంటూ జనాల వీక్ నెస్‌తో ఆడుకోవడంపై వివాదాలు తలెత్తుతుంటాయి. తెలుగు హీరోల్లో ఎక్కువగా అంటే మహేష్ బాబు ప్రకటనల్లో నటిస్తుంటారు. దాదాపు ఇరవై ప్రొడక్ట్‌లకు పైగా అంబాసిడర్‌గా మహేష్ బాబు ఉన్నారు. అయితే అవేవీ కూడా జనాలకు అంతగా హానీ కలిగించే మత్తు మదార్థాలు, గుట్కా, మద్యం వంటివి కావు. కానీ తాజాగా ఓ హీరోయిన్ ఆల్కహాల్‌ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది.

రెజీనాకు ఇప్పుడు తెలుగులో అంతగా క్రేజ్ లేకుండా పోయింది. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన రెజీనా ఆ తరువాత కోలీవుడ్‌లో మంచి ఆఫర్లను పట్టేసింది. అక్కడే వరుసగా ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఎవరు సినిమాతో మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చింది రెజీనా. అందులో నటించిన తీరు, అందాలను ప్రదర్శించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు.

అయితే చివరగా వచ్చిన చక్ర సినిమా అంతగా వర్కవుట్ కాలేదు. విశాల్, రెజీనాలకు సినిమా సక్సెస్ ఇవ్వలేకపోయింది. అయితే రెజీనా మాత్రం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆమె చేసిన ఓ పోస్ట్ మీద నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఆమెను అన్ ఫాలో అవుతున్నామంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.