ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న క్రేజీ సీక్వెల్ సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా.. ఈ మూవీ ను దర్శకుడు పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పై సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ చిత్ర పోస్టర్స్పైసినిమా పై అంచనాలను రెట్టింపు చేశాయి. కాగా, ఈ మూవీ ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, ఈ మూవీ రిలీజ్ డేట్ పై మేకర్స్ తాజాగా క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ సినిమా ని ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఒక సరికొత్త పోస్టర్ తో అనౌన్స్ చేశారు. ఇక ఈ మూవీ తో రామ్, పూరీల కాంబినేషన్ మరో బిగ్ హిట్ అందుకోవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
![‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది ...ఎప్పుడంటే ..! The release date of the 'Double Smart' movie has arrived...when is it..!](https://i0.wp.com/telugu.telugubullet.com/wp-content/uploads/2024/06/Untitled-design-12-2.jpg?resize=300%2C197&ssl=1)
‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా లో యంగ్ బ్యూటీ కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తోండగా.. షాయాజీ షిండే, గెటప్ శ్రీను తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ కు మణిశర్మ సంగీతం అందిస్తుండగా చార్మీ కౌర్ తో కలిసి పూరీ జగన్నాధ్ ఈ మూవీ ని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.