స్పీకర్ కు లేఖ రాసిన ఎం.పీ

స్పీకర్ కు లేఖ రాసిన ఎం.పీ

లోక్ సభ స్పీకర్ కు మల్కాజ్ గిరి ఎం.పీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లేఖ రాశారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో మా గొంతు వినిపించాలని అనుకున్నానని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ భూమిని వారి బంధువులకు, టిఆర్ఎస్ అధికార పార్టీ కార్యకర్తలకు అతి తక్కువ ధరలకు విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటులో సమస్యను లేవనెత్తాలని తాము నిర్ణయించుకున్నామన్నారు.

ఇవాల్టి నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశానికి హాజరుకావాలని అనుకున్నానన్నారు. సంబంధిత అధికారులకు పదేపదే అభ్యర్థన చేసినప్పటికీ, ఢిల్లీకి వెళ్లాలని తెలిపినప్పటికీ తెలంగాణ రాష్ట్ర పోలీసులు పార్లమెంట్ కు వెళ్లాడాన్ని అడ్డుకున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యుడు పార్లమెంటుకు హాజరుకావడం , ప్రజల ఆందోళనలను తెలియజేయడం తన హక్కు , బాధ్యత అన్నారు.

పార్లమెంట్ నడుస్తున్న సమయంలో పార్లమెంట్ హక్కులను అడ్డుకొని పార్లమెంటుకు హాజరుకాకుండా చేశారు, రాజకీయ కారణాలతో పార్లమెంటు సభ్యుడిని అరెస్టు చేయడానికి గౌరవ స్పీకర్ అనుమతి ఖచ్చితంగా అవసరమన్నారు. అందువల్ల మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. పార్లమెంట్ కు ఉన్న ప్రత్యేక హక్కులను ఉపయోగించి పార్లమెంట్ లో పాల్గొని ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశాలు తనకు కల్పించాలని కోరుకుంటున్నానని లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.