ఖడ్గమృగం చేస్తున్న డ్యూటీ

లాక్‌డౌన్‌లో నిబంధనలను పాటించని.. మాట వినని… వ్యక్తులకు సరైన బుద్ధి చెప్పింది ఓ ఖడ్గమృగం. రోడ్డుపై ఎటువంటి భయం లేకుండా నడుస్తోన్న ఓ వ్యక్తిని బెదరగొట్టింది. నేపాల్‌లో రోడ్డుపైకి వచ్చిన ఖడ్గమృగానికి సంబంధించి వీడియోను ఓ ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కాస్వాన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన చిత్వాన్‌ నేషనల్‌ పార్క్‌ నుంచి భారీ జంతువులు తరచుగా జనసంచారంలోకి వస్తుంటాయి.

అయితే కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటిస్తే.. కొందరు నిబంధనలను అతిక్రమిస్తూ బయట తిరుగుతున్నారు. దీంతో వీధులను తనిఖీ చేయడానికి ఖడ్గం వచ్చింది అంటూ ప్రవీణ్‌ కాస్వాన్‌ పోస్ట్‌ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆ వీడియోలో రోడ్డుపై నడుచుకుంటూ.. వెళ్తున్న ఓ వ్యక్తిని ఖడ్గమృగం కుమ్మడానికి వెంబడించింది. ఆ తర్వాత తనదారిన అది వెళ్లిపోయింది. కాగా ప్రవీణ్‌ కాస్వాన్‌ పోస్ట్‌ చేసిన వీడియోకు ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పిటర్సన్‌ స్మైలీ సింబల్‌తో బదులిచ్చారు. ఖడ్గమృగాన్నిచూసి వీధుల్లోని యువకుడు రాకెట్‌ స్పీడుతో అక్కడి నుంచి జారుకున్నాడు.. అంటూ ఓ నెటిజన్‌ సెటైర్‌ విసరగా..

లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన ఆ యువకుడిని తన గొప్ప మనసుతో ఖడ్గమృగం వదిలి పెట్టిందని మరో నెటిజన్‌ కామెంట్స్ గుప్పిస్తున్నాడు. కరోనా వైరస్‌ అరికట్టడానికి నేపాల్‌ ప్రభుత్వం మార్చి24న వారం పాటూ లాక్‌డౌన్‌ ప్రకటించి.. తర్వాత ఏప్రిల్‌ 15 వరకు పొడిగించింది. దీంతో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. ఆ సమయంలో అడవుల్లోని జంతువులు రోడ్లపైకి పెద్దఎత్తున రావడం విశేషం.