కేసీఆర్‌తో తేజస్వి యాదవ్ భేటీ

కేసీఆర్‌తో తేజస్వి యాదవ్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, థర్డ్‌ ఫ్రంట్‌పై సీఎం కేసీఆర్‌తో తేజస్వి మంతనాలు సాగించనున్నారు. ఇటీవల బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ఈ మధ్యే లెఫ్ట్‌ పార్టీల జాతీయ నేతలతో సీఎం కేసీఆర్‌ చర్చలు జరిపారు. తేజస్వి యాదవ్‌ బృందంలో సమాజ్ వాదీ పార్టీ నేతలు అబ్దుల్ సిద్దిఖీ, సునీల్ సింగ్ ఉన్నారు. ప్రస్తుతం బిహార్ విపక్ష నేతగా ఉన్న తేజస్వి యాదవ్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే.