నారాయణ సంస్థల మీద ఐటీ దాడులు…వదంతులే !

Rumours Doing Rounds On IT Raids In Narayana colleges

గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి నారాయణ తేల్చి చెప్పారు. నారాయణ విద్యాసంస్థల్లో ఐటీ దాడులు జరుగుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏపీ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఇప్పటివరకు నారాయణ సంస్థలపై ఐటీ దాడులు జరగలేదని స్పష్టం చేశారు. అవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు. మంత్రి నారాయణ మాత్రమే కాక ఆయనకు సంబందించిన నారాయణ విద్యా సంస్థలు ఒక ప్రకటన విడుదల చేసింది. పొద్దున్న నుండి సర్క్యులేట్ అవుతున్న ఈ వార్త నిజం కాదని అన్నీ ఊహాగానాలే అని స్పష్టం చేసింది. అలాగే తాము చట్టానికి లోబడి అన్ని ట్యాక్స్ లు సవ్యంగానే కడుతున్నామని వారు ఒక ప్రకటన విడుదల చేశారు.