నా కల నిజమైంది

నా కల నిజమైంది

స్నేహితురాలితో కలిసి చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన సమంత ట్రిప్‌ ముగిసింది. య‌మునోత్రి నుంచి మొద‌లైన యాత్ర గంగోత్రి మీదుగా కేదార్‌నాథ్‌, బ‌ద్రీనాథ్ వ‌ర‌కు సాగింది. 1968నాటి మహేశ్ యోగి ఆశ్రమానికి సైతం వెళ్లిన సమంత అక్కడి విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక చార్‌ధామ్‌ యాత్ర గురించి సమంత ఓ పోస్టును షేర్‌ చేస్తూ.. ‘మహాభారతాన్ని చదివినప్పటి నుంచి ఈ భూమ్మీద స్వర్గదామమైన హిమాలయాలను సందర్శించాలని అనుకున్నాను. ఇప్పుడు నా కల నిజమైంది. నేను ఏది అయితే ఆశించానో అది జరిగింది. నా హృదయంలో హిమాలయాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది’ అని తెలిపింది. సామ్‌ పోస్టుకు వెంకటేశ్‌ కూతురు ఆశ్రిత సైతం స్పం‍దించింది.

బాలీవుడ్‌ నటి కంగనా కూడా వావ్‌ అంటూ కామెంట్‌ చేసింది. కాగా నాగ చైతన్యతో విడాకుల అనంతరం తీవ్ర మనోవేదనలో ఉన్న సమంత మానసిక ప్రశాంతత కోసం తీర్థయాత్రలను సందర్శిస్తున్నట్లు సమాచారం. గతాన్ని మర్చిపోయి త్వరలోనే బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో కెరీర్‌పై దృష్టి పెట్టాలని ప్లాన్‌ చేస్తుంది. సమా్‌ నటించిన శాకుంతలం, కాతువాకుల రెండు కాధ‌ల్ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.