తొలి పౌరాణిక చిత్రం

తొలి పౌరాణిక చిత్రం

సమంత హీరోయిన్‌గా నటిస్తున్న తొలి పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలైంది.

ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనే సెకండ్‌ షెడ్యూల్‌ కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్స్‌ని తిర్చిదిద్దారు. ప్రస్తుతం అందులోనే షూటింగ్‌ జరుగుతోంది. ‘దిల్‌’ రాజు, నీలిమా గుణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే 50 శాతం పూర్తయింది.