కల్నల్ సంతోష్ బాబుకు ప్రముఖులు ఘన నివాళి

భారత్- చైనా సరిహద్దు ప్రాంతమైన లడఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా దాడిలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం నిన్న రాత్రి 11:40 గంటలకు సూర్యాపేటలోని ఆయన నివాసానికి చేరుకుంది. అయితే ఆరోజు ఉదయం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించిన పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ డి.అర్వింద్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తదితరులు సంతోష్ బాబు మృతదేహానికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. ఇప్పుడు సంతోష్ బాబు అంతిమ యాత్ర కొనసాగుతుంది.  కేసారంలోని సంతోష్ బాబు కుటుంబ సభ్యుల వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.