బాలీవుడ్‌ లోకి సత్యదేవ్‌

బాలీవుడ్‌ లోకి సత్యదేవ్‌

హీరోగానూ, కీలక పాత్రలు చేస్తూ తెలుగులో మంచి గుర్తింపును తెచ్చుకున్న సత్యదేవ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఖరారైంది. అక్షయ్‌కుమార్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, నుష్రత్‌ ప్రధాన పాత్రల్లో అభిషేక్‌ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామ సేతు’లో ఓ కీలక పాత్రలో సత్యదేవ్‌ కనిపించనున్నారు. ‘‘కొన్ని విషయాలు మనం ఊహించకుండానే జరిగిపోతుంటాయి.

నా బాలీవుడ్‌ పరిచయం కూడా అంతే. నేను నా ప్రొఫైల్‌ను బీ టౌన్‌లో షేర్‌ చేయలేదు. కానీ ‘రామ సేతు’లో నటించే అవకాశం వచ్చింది. హ్యాపీ’’ అన్నారు సత్యదేవ్‌.అతడు నటించిన ‘తిమ్మరుసు’ చిత్రం కూడా రిలీజ్‌కు సిద్ధమైంది. ఇందులో ప్రియాంకా జవాల్కర్‌ హీరోయిన్‌గా నటించింది. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు నిర్మించారు.