మెగాస్టార్ చిరంజీవి పై తమ్మారెడ్డి భరద్వాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి పై తమ్మారెడ్డి భరద్వాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి ఫై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ ని ఎలా అభివృద్ధి చేయాలో చర్చించేందుకు చిరు, నాగార్జున తాజాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిశారు. అయితే చిరంజీవి ని నంది అవార్డ్స్ కమిటీకి చైర్మన్ గా నియమించనున్నారు అని రకరకాల వార్తలు వస్తున్నట్లు తెలిపారు. అయితే చిరు కి ఆ అవకాశం వచ్చినా వద్దని చెబుతా అంటూ తమ్మినేని భరద్వాజ్ అన్నారు. ఎందుకంటే చిరు స్థాయికి ఆ గౌరవం సరిపోదంటూ వ్యాఖ్యలు చేసారు. ఒకవేళ కమిటీ చైర్మన్ అయినా నేను గొడవపడి తీయించేస్తా అని అన్నారు.

పనిపాట లేని వాళ్ళు అలాంటి పదవికి ఉంటారు అని అన్నారు. ఏదైనా సమస్య వచ్చినా చిరు పైకి నెట్టేస్తారు అని అన్నారు.అయితే చిరంజీవి ఫై పొగడ్తల వర్షం కురిపించారు. చిరుకి ఏ పదవి అవసరం లేదని, చిరు సుప్రీం స్థాయిలో ఉన్నారు అని అన్నారు. ఈరోజు చిత్ర పరిశ్రమలో ఏదైనా చేయగలిగే స్థాయిలో చిరు ఉన్నారు అని అన్నారు. చిరు కి పిలిచి పదవి ఇవ్వాల్సిన అవసరం లేదని, అసలు చిరు కు అలాంటి పదవుల్లో ఉండే సమయం లేదని అన్నారు.