లెజెండరీ నటుడితో హీరో శింబు

ఓవైపు బాలీవుడ్లో, మ‌రోవైపు శాండిల్‌వుడ్లో డ్రగ్స్ అంశం కొన్ని రోజులుగా క‌ల‌క‌లం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ విష‌యానికి వ‌స్తే.. డ్ర‌గ్స్ రాకెట్‌తో సంబంధ‌ముంద‌న్న ఆరోప‌ణ‌ల‌తో హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా వీరి ఆర్థిక వ్య‌వ‌హారాల గురించి ఆరా తీస్తే ఒక్కొక్క‌రికి ఉన్న ఆస్తుల గురించి తెలిసి పోలీసులకు దిమ్మ‌దిరిగిపోయింద‌ట‌. ముఖ్యంగా సంజ‌న ఆస్తులు వారికి విస్మ‌యం క‌లిగించిన‌ట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేస్తోంది. బెంగుళూరు నగరంలో పదికి పైగా ఖ‌రీదైన ఫ్లాట్లు సంజ‌న పేరిట ఉన్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంద‌ట‌. సంజ‌న క‌న్న‌డ‌తో పాటు తెలుగు, త‌మిళంలోనూ న‌టించింది. కానీ ఆమె అన్ని చోట్లా చిన్నా చిత‌కా సినిమాలే చేసింది. తెలుగులో చేసిన పెద్ద సినిమా బుజ్జిగాడులో కూడా ఆమెది సైడ్ రోలే. ఇలాంటి క‌థానాయిక సినిమాల ద్వారా ఎంత ఆదాయం సంపాదించి ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తే.. దానికి, త‌న పేరిట ఉన్న ఆస్తుల‌కు అస‌లు పొంత‌నే లేద‌ట‌. ఈ నేప‌థ్యంలో డ్ర‌గ్ రాకెట్లో భాగం కావ‌డం ద్వారా సంజ‌న ఈ ఆస్తులు సంపాదించిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా సంజ‌నను డ్ర‌గ్ టెస్టు కోసం ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా ఆమె శాంపిల్ ఇవ్వ‌డానికి నిరాక‌రించింది. త‌న‌ను బ‌క‌రాను చేశారంటూ అక్క‌డ పోలీసుల‌పై విరుచుకుప‌డింది. సంజ‌న‌తో పాటు రాగిణిని వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజ‌రు ప‌రిచిన పోలీసులు త‌దుప‌రి విచార‌ణ కోసం వారిని త‌మ క‌స్ట‌డీలోకి తీసుకున్నారు.

కోలీవుడ్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సహవాసం చేస్తూ ఉండే హీరో శింబు. ఒక దశ దాటాక అతడి వ్యవహారాలు శ్రుతి మించి పోయి అతడి సినిమాలు మధ్యలో ఆగిపోవడం, విడుదలకు నోచుకోకపోవడం, కమిటైన సినిమాలు పట్టాలెక్కకుండానే క్యాన్సిల్ అయిపోవడం.. ఇలా తయారైంది పరిస్థితి.

శింబు నుంచి ఒక హిట్ సినిమా వచ్చి కూడా చాలా కాలం అయిపోయింది. చివరగా అతను చేసిన ‘అత్తారింటికి దారేది’ రీమేక్ ‘వందా రాజాదా వరువేన్’ డిజాస్టర్ అయింది. ప్రస్తుతం అతను వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ అనే సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల దానికీ బ్రేక్ పడింది. కాగా ఇప్పుడు శింబు ఓ అరుదైన కాంబినేషన్లో సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలొస్తున్నాయి. లెజెండరీ నటుడు కమల్ హాసన్‌తో కలిసి శింబు నటించనున్నాడట.

కమల్ కెరీర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘సిగప్పు రోజాక్కల్’ ఒకటి. తెలుగులో ‘ఎర్ర గులాబీ’లు పేరుతో రిలీజై ఇక్కడా సూపర్ హిట్టయిందా చిత్రం. సైకో కిల్లర్ రామన్ రాఘవ్ జీవిత కథ ఆధారంగా భారతీ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 80ల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా స్ఫూర్తితో శింబు ‘మన్మథన్’ అనే సినిమా చేశాడు. తెలుగులో అది ‘మన్మథ’ పేరుతో రిలీజైంది. రెండు చోట్లా ఆ సినిమా సూపర్ హిట్. శింబు కెరీర్లో అతి పెద్ద విజయం అదే. ఇప్పుడు శింబు ‘సిగప్పు రోజాక్కల్’కు సీక్వెల్ చేయబోతున్నాడట.

ఇందులో కమల్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడట. ఒరిజినల్‌కు కొనసాగింపులా ఆయన పాత్ర ఉంటుందట. భారతీ రాజా తనయుడు, నటుడు అయిన మనోజ్ భారతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. ఐతే కమల్ ప్రస్తుతం ‘ఇండియన్-2’ పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఎన్నికల్లో బిజీ అవుతాడు. ఆ తర్వాత శింబుతో కలిసి ‘సిగప్పు రోజాక్కల్’ సీక్వెల్లో నటించే అవకాశముంది.