చంద్రబాబుకి షాకిచ్చిన సోము వీర్రాజు

Somu Veerraju Gave Shock To Chandra Babu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Somu Veeraju Wrote A Letter And Gave Shock To Chandra Babu

విశాఖ భూ కుంభకోణంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీ సీఎంకు లేఖ రాసిన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కుంభకోణాలు టీడీపీ నేతలే చేస్తున్నారని కుండబద్దలు కొట్టిన వీర్రాజు.. ఆ టీడీపీ నేతలకు కాంగ్రెస్ బ్యాక్ గ్రౌండ్ ఉందని బాంబు పేల్చారు. దీంతో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి వాదనకు గట్టి మద్దతు లభించినట్లైంది. కాంగ్రెస్ లోంచి ఎన్నికల ముందు టీడీపీలో చేరిన వాళ్లే ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారనేది ఆయన వాదన.

ఈ లేఖ టీడీపీలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. చంద్రబాబు తమకు పొమ్మనలేక పొగ బెడుతున్నారా అనే యాంగిల్లో కాంగ్రెస్ నుంచి వచ్చినవారు కిందా మీదా పడుతున్నారు. క్యాబినెట్ మంత్రిగా కంటే.. దళారి పాత్రను సమర్థంగా పోషిస్తున్న గంటాను ఉద్దేశించే ఈ లేఖ రాశారని టీడీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. అధినేత ఇప్పటికైనా స్పందించి అలాంటి వారిని ఏరేయాలని వాళ్లు కోరుతున్నారు.

ఇప్పటికే విశాఖ ల్యాండ్ స్కామ్ పై సిట్ ఏర్పాటైంది. ఈ వ్యవహారంలో సీఎం సీరియస్ గా ఉన్నారు. ఇలాంటి సమయంలో వీర్రాజు లేఖ రాయడం, టీడీపీ నేతల కాంగ్రెస్ బ్యాక్ గ్రౌండ్ ప్రస్తావనకు రావడం వ్యూహాత్మకమేననే వాదన కూడా ఉంది. సిట్ వారి పేర్లు నిగ్గుతేల్చిన తర్వాత.. ఈ లేఖలోని అంశాలు కూడా జతచేసి.. అటు బీజేపీతో కూడా సర్టిఫికెట్ ఇప్పించాలనేది బాబు ప్లాన్ గా కనిపిస్తోంది. ఇలాంటి చాణక్య వ్యూహాల్లో దిట్టైన చంద్రబాబు.. తన చేతికి మట్టి అంటకుండా బీజేపీ చేత అలాంటి నేతల్ని బయటకు పంపేలా ఒత్తిడి చేయించాలని లేఖ రాయించి ఉంటారని టీడీపీ కార్యకర్తలు సంతోషపడుతున్నారు.

పిల్లల కోసం డీడీ డిస్నీ

బన్నీ గత జన్మలో ఏంటో తెలుసా?