సౌత్‌ క్వీన్స్‌ నిర్మాత చేతులెత్తేశాడు

south-queen-movie-producer-tyagarajan-in-risk

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన ‘క్వీన్‌’ చిత్రాన్ని సౌత్‌లో ఏకంగా నాలుగు భాషల్లో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళంలో ఈ చిత్రం వేరు వేరు హీరోయిన్స్‌తో చిత్రీకరణ చేస్తున్నారు. ఈ నాలుగు భాషల్లో కూడా నిర్మించేది ఒకే నిర్మాత అనే విషయం తెల్సిందే. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్‌, మలయాళంలో మంజిమా మోహన్‌, కన్నడంలో పరుల్‌ యాదవ్‌లు క్వీన్స్‌గా నటిస్తున్నారు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రాలను ఇటీవలే ప్రాన్స్‌లో షూట్‌ చేసిన విషయం తెల్సిందే. ఒకే చిత్రం అయినా నాలుగు భాషల్లో వేరు వేరుగా రీమేక్‌ చేయాలి కనుక బడ్జెట్‌ చాలా అధికం అవుతుంది.

ముందుగానే అనుకున్న బడ్జెట్‌కు దాదాపు మూడు రెట్ల బడ్జెట్‌ అధికం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి షెడ్యూల్‌ పూర్తి అయిన తర్వాత బడ్జెట్‌ విషయంలో నిర్మాత త్యాగరాజన్‌ ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది. త్యాగరాజన్‌ ప్రస్తుతం క్వీన్‌ రీమేక్‌ చిత్రా కోసం ఫైన్సాన్సియర్‌లను వెదికే పనిలో పడ్డాడు. ఇక మిగిలి ఉన్న బ్యాలన్స్‌ చిత్రీకరణ కోసం బడ్జెట్‌తో మార్పు చేర్పులు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. మరి కొందరు మాత్రం ఈ చిత్రం పూర్తి అవ్వడం కష్టమే అని, సినిమా కోసం నిర్మాత అతిగా ఖర్చు చేసి మొదటికే మోసం అయ్యేలా చేశాడు అంటున్నారు. సినిమా ప్రస్తుతానికి ఆగిపోయిందని అనధికారిక సమాచారం అందుతుంది. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి క్లారిటీ రాలేదు. తెలుగు వర్షన్‌కు నీలకంఠ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.