Sports: IPL 2024లో పంజాబ్ పై విజయకేతనం ఎగరేసిన హైదరాబాద్..

Sports: Hyderabad beat Punjab in IPL 2024.
Sports: Hyderabad beat Punjab in IPL 2024.

నిన్న ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా హైదరాబాద్, పంజాబ్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు 2 పరుగులు తేడాతో విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. అయితే హైదరాబాద్ బ్యాటర్లలో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి 64 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు.

అటు హెడ్ 21 పరుగులు చేశాడు. అబ్దుల్ సమాద్ 25 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టు… మొదట్లో తడబడి ఆ తర్వాత గెలుపు దిశగా పయనించింది. కానీ హైదరాబాద్ బౌలర్ల దాటికి 180 పరుగుల వద్ద ఆగిపోయింది పంజాబ్. దీంతో హైదరాబాద్ జట్టు రెండు పరుగులు తేడాతో విజయం సాధించింది.