Sports: నాలుగో టెస్ట్‌కు తుది జట్టును ఖరారు చేసిన భారత్

Sports: India has finalized the final squad for the fourth Test
Sports: India has finalized the final squad for the fourth Test

ఐదు టెస్టులలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత్ వైజాగ్, రాజ్‌కోట్ టెస్ట్‌లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాంచీ వేదికగా జరగబోయే నాలుగో టెస్ట్‌కు వ్యూహాలను రచిస్తుంది.నాలుగో టెస్ట్‌లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆడటం అనుమానంగా ఉంది. అతడిపై తీవ్రమైన వర్క్‌లోడ్‌ ఉండటంతో బీసీసీఐ విశ్రాంతి ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న కేఎల్‌ రాహుల్‌ నాలుగో టెస్ట్‌కూ దూరం కానున్నట్లు సమాచారం.

బుమ్రా స్థానంలో యువ పేసర్ ముకేశ్‌ కుమార్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నారు. కేఎల్ రాహుల్ స్థానంలో రజత్ పటిదార్‌కు మరొక అవకాశం ఇవ్వనున్నారు. ఇక సిరాజ్, ముఖేష్ కుమార్ పేస్ బౌలింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ ఇప్పటికే 2-1 ఆధిక్యంతో ఉంది. మరి నాలుగవ టెస్టులో భారత్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి మరి.