Sports: రాజ్ కోట్ చేరుకున్న రోహిత్‌ సేన.. నేటి నుంచే ప్రాక్టీస్

Sports: Rohit Sena has reached Rajkot. Practice from today
Sports: Rohit Sena has reached Rajkot. Practice from today

ఈనెల 15 నుంచి ఇంగ్లాండ్ తో మూడో టెస్టు జరగనున్న నేపథ్యంలో భారత్ రాజ్ కోట్ కు చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగానే వచ్చేయగా…. మిగిలిన జట్టు నిన్న అర్ధరాత్రి హోటల్ కు వచ్చింది. నేటి సాయంత్రం నుంచి ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలు పెట్టే ఛాన్స్ ఉంది. ఐదు టెస్టుల సిరీస్ లో రెండు జట్లు చెరొకటి గెలిచిన సంగతి తెలిసిందే. మూడో టెస్టులో గెలిచి సిరీస్ లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని టీమ్ ఇండియా భావిస్తోంది.

కాగా, గాయం కారణంగా ఇంగ్లాండ్ తో రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్ కోలుకున్నారు. ఇవాళ నెట్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. దీంతో అతను ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్ ఆడటం ఖాయమని తెలుస్తోంది. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ జట్టులో లేని పరిస్థితిలో కేఎల్ ఎంట్రీ భారత్ కు శుభవార్తెనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, మూడో టెస్టులో రవీంద్ర జడేజా ఆడటంపై క్లారిటీ రావాల్సి ఉంది.