పలాసలో వలస కూలీల బస్సు బోల్తా.. 33 మందికి గాయాలు..

ఈ మధ్య ఏ ప్రమాదాలు చూసినా వలస కూలీలు మృతి చెందుతూనే ఉన్నారు. తమ జీవీతాల పై మృత్యువు కబలించినట్లు ఉంటుంది.ఎటు చూసినా వారు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో జిల్లాలో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని స్థానిక బాలిగాం వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 33 మందికి గాయాలయ్యాయి. పశ్చిమబెంగాల్‌కు చెందిన వలసకూలీలు కర్ణాటకలో క్వారంటైన్‌ ముగించుకుని వారి వారి సొంతూళ్లకు వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది.

కాగా బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్తున్న బస్సు శ్రీకాకుళం జిల్లా మందన మండలం బాలిగాం వద్ద అదుపుతప్పి బోల్తా పడటంతో స్థానికంగా కలకలం రేగింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నట్లు తెలుస్తోంది.