రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం

రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కి రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. కాగా నారా లోకేష్ కి ఇప్పటి వరకు కూడా వై ప్లస్ భద్రత ఉందని తెలుస్తుంది. కాగా ఆ భద్రతని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ఇదివరకు వై ప్లస్ కేటగిరీ కింద ఇప్పటి వరకు కూడా నారా లోకేశ్ కు 2 ప్లస్ 2 భద్రత ఉండేది. కాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ఆ భద్రత 1 ప్లస్ 1కు తగ్గిపోనుంది. ఇకపోతే గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నారా లోకేశ్ భద్రత 4 ప్లస్ 4 గా రక్షణగా ఉండేది. కాగా గతంలో ఉత్తరాంధ్ర కి సంబందించిన ఎమ్మెల్యే ను మావోలు చంపేయడంతో నారా లోకేష్ కి ఆ సమయంలో జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. కానీ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక నారా లోకేష్ కి అప్పటి వరకు ఉన్నటువంటిఉన్నటువంటి భద్రతను 2 ప్లస్ 2 కి తగ్గించారు. ఇప్పుడు ఇక చివరికి ఆ భద్రతని కూడా తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.