సుశాంత్ సింగ్ మరణాన్ని తట్టుకోలేక మరదలు మృతి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే. సుశాంత్ మానసిక వత్తిడితో బలవన్మరణానికి పాల్పడ్డాడని నివేదికలో కూడా తెలుస్తోంది. అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంత్యక్రియలు జరిగి 24 గంటలు కూడా కాకముందే.. వారింట్లో మరో విషాదం నెలకొంది. సుశాంత్ మరదలు (సుశాంత్ కజిన్ భార్య) సుధా దేవి బీహార్ లోని పుర్నియాలో హఠాన్మరణం పొందారు.

అదేవిధంగా ముంబైలో సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఆమె కుప్పకూలి మరణించిందని సమాచారం అందుతుంది. అలాగే.. తనను ఎంతగానో ఆప్యాయంగా చూసుకొనే సుశాంత్ మరణాన్ని ఆమె తట్టుకోలేకపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిందని తెలుస్తోంది. అంతేకాకుండా సుశాంత్ మరణ వార్త విన్న తర్వాత ఆమె ఆహారం తీసుకోవడం మానేసిందని కూడా ఓ జాతీయ పత్రిక ప్రత్యేక కథనం ద్వారా వెల్లడించింది. కాగా సుశాంత్ అంత్యక్రియలు సోమవారం ముంబైలోని విల్లే పార్లే పరిధిలో ఉన్న పవన్ హాన్స్ శ్మశానవాటికలో నిర్వహించారు.