బాబు మీద బీజేపీ హత్యాయత్నం…!

TDP Activists Trying To Kill Me Says Kanna

ఈరోజు టీడీపీ కార్యకర్తల మీద ఏపీ బీజేపీ అధ్యక్ష్యుడు కన్నా లక్ష్మి నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తన ఇంటి బయట నిరసన తెలియచేయడనికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు లోకేష్, చంద్రబాబు ఆదేశాల మేరకే నా ఇంటి మీదకు వచ్చారని వాళ్లంతా నన్ను చంపడానికే వచ్చారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు నేను కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తానని ఆయన ఒక రేంజ్ లో ఫైరయి పోయారు. ఇక్కడ నవ్వొచ్చే విషయం ఏంటంటే ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తేనే.. తనను చంపడానికి వచ్చినట్లు ఫీలైపోతున్న కన్నా లక్ష్మినారాయణ కాకినాడలో బీజేపీ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‌కు అడ్డు పడటం కూడా చంద్రబాబుని చంపడం కోసమే అని లాజిక్ ఎలా మిస్సయ్యారో ?. అంటే ఇప్పుడు కన్నా ఆరోపణల ప్రకారం చంద్రబాబును చంపడానికే బీజేపీ కార్యకర్తలు కాన్వాయ్‌ను అడ్డుకున్నారా ? వాస్తవానికి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకోవడం తీవ్రమైన నేరం అని.

ఆ విషయం తెలిసినా కూడా ఆయన కాన్వాయ్ కు అడ్డు పదేనుకు ఉదయం నుండి ఎందుకు కాపు కాశారు ? అసలు బీజేపీ నేతల మాటల మోడీని కాపు కసుకోవడానికి వాళ్ళు ఏమి చేస్తున్నా సమర్దిన్చాడనికే వాళ్ళ తాపత్రయం కనిపిస్తోందని మీడియా నుండి సామాన్యుడిదాక అందరూ ముక్త కంఠంతో చెబుతున్నా తీరు మారడం లేదు. మోడీని తృప్తి పరచడానికి సొంత రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని లుచ్చా అని వ్యాఖ్యానించిన బీజేపీ నేతల తీరు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. చిన్నపాటి రాజకీయ ఆందోళనలను కూడా పెద్దగా చిత్రీకరించి కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామంటూ బెదిరిస్తూ కేంద్రంలో తమ ప్రభుత్వం ఉందంటూ హెచ్చరించడంతో బీజేపీ నేతలు తమ పార్టీకి పార్టీలో తమ ఏపీ భవిష్యత్తుకి గోరీలు స్వయంగా కట్టుకుంటున్నారు.