పదేళ్ల వరకు మీడియాకు దూరంగా ఉంటాడట!

teja will avoid from media promotion for the next 10 years,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సినిమా వారు అయిన, రాజకీయ నాయకులు అయినా కూడా ఎప్పుడు మీడియాలో ఉండాలని కోరుకుంటారు. తమకు మంచి పబ్లిసిటీ రావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే దర్శకుడు తేజా మాత్రం మీడియాకు దూరంగా ఉంటూ ఉంటాడు. ఎప్పుడు కూడా మీడియాతో పెద్దగా మాట్లాడినట్లుగా కనిపించడు. తాను ఏం చేసినా, ఏం మాట్లాడినా కూడా వివాదాస్పదం అవుతుందనే ఉద్దేశ్యంతో పదేళ్ల వరకు మీడియాతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లుగా తేజ సంచలన ప్రకటన చేశాడు. 

ఇటీవల ఈయన రానా హీరోగా కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. వచ్చే నెల 11న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రానా మరియు కాజల్‌లు మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తారని చిత్ర యూనిట్‌ సభ్యు చెప్పుకొచ్చారు. తేజకు ఇంటర్వ్యూలు ఇవ్వడంపై ఆసక్తి లేదని, ఆయన 10 సంవత్సరాలు మీడియాకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. ఇటీవల తేజాపై నటీ నటులను వేదించుకు తింటాడు, ఒక పద్దతి పాడు లేకుండా సినిమాను చేస్తాడు. తీసిందే మళ్లీ మళ్లీ తీస్తాడు అనే విమర్శలు వచ్చాయి. దాంతో తేజా మీడియాను దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే తేజా తీరుపై సినీ వర్గాల్లోనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని వార్తలు