ఆదికి నిరాశే మిగిలింది

aadhi pinisetty upset with like guest role in ninnu kori movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తమిళ హీరో ఆది పినిశెట్టి తెలుగులో గుర్తింపు తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ‘సరైనోడు’ చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించిన ఆదికి అదే తరహా పాత్రలు వస్తున్నాయి. కార్యరెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా ప్రయత్నం చేద్దామనే ఉద్దేశ్యంతో నాని హీరోగా నటించిన ‘నిన్ను కోరి’ చిత్రాన్ని చేశాడు. తాజాగా విడుదలైన ‘నిన్ను కోరి’ చిత్రం ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో ఆది పాత్ర పెద్దగా ప్రాముఖ్యత లేకుండా ఉంది. దాంతో ఆదికి నటుడిగా తనను తాను నిరూపించుకునే అవకాశం లేకుండా పోయింది. 

‘నిన్ను కోరి’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకుని ఆది హీరోగా నటించాలని భావించాడు. అయితే ఆదికి మాత్రం పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్ర రావడంతో తెలుగు ప్రేక్షకులు ఈయన్ను పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఈయన తెలుగులో పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. దాంతో పాటు చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రంలో కూడా ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఆ రెండు సినిమాలు అయినా ఆదికి గుర్తింపును తీసుకు వచ్చి తెలుగులో ఆయన కోరినట్లుగా హీరో ఛాన్స్‌లు వస్తాయో చూడాలి. ఇటీవలే ఆది తమిళంలో నటించిన ‘మరకతమణి’ చిత్రం తెలుగులో డబ్‌ అయ్యి విడుదల అయ్యింది. కాని ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆధరించలేదు.

మరిన్ని వార్తలు