డిపార్ట్‌మెంటల్‌ కబడ్డీ టోర్నీ

డిపార్ట్‌మెంటల్‌ కబడ్డీ టోర్నీ

సరూర్‌నగర్‌లోని సాట్స్ ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన స్టేట్ ఎ డివిజన్ ఇంటర్ డిపార్ట్‌మెంటల్ ఎ డివిజన్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ పోస్టల్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. మొదటి మ్యాచ్‌లో పోస్టల్ జట్టు 56-20తో ఆంధ్ర బ్యాంక్‌ను ఓడించగా, రెండో మ్యాచ్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే సాట్స్‌ను 63-23తో ఓడించింది. మరో మ్యాచ్‌లో తెలంగాణ పోలీసులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 22-14తో ఓడించారు.

శాట్స్‌ జట్టు మ్యాచ్‌ ఆరంభంనుంచి వెనుకబడింది. మొదటి అర్ధభాగంలో ఎస్‌సీఆర్‌ 46–7తో ఆధిపత్యంలో ఉంది. రెండో అర్ధభాగంలో శాట్స్‌ జట్టు కాస్త ప్రయత్నించిన ప్రయోజనం లేకపోయింది.