అనంతలో రోడ్డు ప్రమాందం.. యువకుడు, గర్భస్థ శిశువు మృతి..

ఆంధ్రప్రదేశ్ లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలోని బొమ్మనహాళ్ మండలంలో గోవిందవాడకు చెందిన అశోక్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అసలే జరిగింది అంటే.. 9నెలల గర్భంతో ఉన్న అక్కను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. నిండు గర్భిణి అయిన అక్కను వైద్య పరీక్ష కోసం ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగడంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది.

అశోక్‌ తన అక్క సుస్మితను తీసుకొని తాజాగా కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రిలో టెస్టుల కోసం బైక్‌పై బయల్దేరాడు. అదే సమయంలో కుందుర్పి మండలం శీగలపల్లికి చెందిన రంగస్వామి బొమ్మనహాళ్‌ వద్ద పని చేస్తున్నాడు. ఉదయాన్నే తమ్ముడు శివతో కలిసి బైక్‌పై పనికి బయల్దేరాడు. హులికల్లు వద్దకు రాగానే వీరిద్దరి బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అశోక్‌ అక్కడికక్కడే మృతి చెందగా… సుస్మిత, రంగస్వామి, శివలకు తీవ్ర గాయాలయ్యాయి.

కాగా ఈ ఘటనలో గాయపడ్డ వారిని వెంటనే కర్ణాటకలోని బళ్లారి ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి సుస్మితకు తీవ్రగాయాలు కావడంతో శిశువు గర్భంలోనే మృతి చెందినట్లు వెల్లడించారు. దీంతో కుటుంబం ఊరు అంతా శోకసంద్రంలో మునిగిపోయింది.