జగన్ క్యాంప్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత … ఆత్మహత్యాయత్నం

the-tension-at-the-pic-camp-office-suicide-attempt

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద నిద్రమాత్రలు మింగి ఓ‌ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. తాను మోస పోయానని, న్యాయం చేయాలని ఈ నెల 19న గన్నవరానికి చెందిన సత్యనాగ కుమారి స్పందనలో అర్జీ పెట్టుకుంది. ఇప్పటి వరకు ఆమె అర్జీపై అధికారులు లేకపోవడంతో నేడు ఆమె సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చింది. అనంతరం క్యాంపు కార్యాలయం నుంచి బయటకు వచ్చిన సత్యనాగ కుమారి నిద్ర మాత్రలు మింగింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు