బిగ్‌ బాస్‌: ఎవరు ఎలిమినేట్‌ అవుతారో టెన్షన్‌ పెరిగింది

బిగ్‌ బాస్‌: ఎవరు ఎలిమినేట్‌ అవుతారో టెన్షన్‌ పెరిగింది
Cinema News, Entertainment

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. బుల్లితెర ప్రేక్షకుల ఆదరణతో ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకున్నది సెలబ్రిటీ గేమ్‌ షో. ఇక 11 వారం నామినేషన్స్‌లో మొత్తం 8 మంది కంటెస్టెంట్లు నిలిచారు. గత వారం ఐదుగురు ఈ జాబితాలో ఉన్నారు . ఈ వీక్ మాత్రం ఏకంగా 8 మంది నామినేషన్స్‌ లిస్టులోకి వచ్చేసారు . శోభావెట్టి, ప్రియాంక జైన్‌, అమర్‌ దీప్ చౌదరి, రతికా రోజ్‌, ప్రిన్స్‌ యావర్‌, అశ్విని శ్రీ, గౌతమ్‌ కృష్ణలు 11 వారం నామినేషన్స్‌ లిస్టులో ఉన్నారు. నామినేషన్స్‌ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ వారం ఓటింగ్‌ కూడా భారీగానే జరుగుతోంది. ఇక్కడ ప్రిన్స్‌ యావర్‌ టాప్‌లో కొనసాగుతుండడం గమనార్హం. సుమారు 34 శాతం ఓట్లు అతనికే పడ్డాయి. అయితే యావర్‌ అగ్రస్థానంలో ఉండడానికి ఒక ఆశ్చర్యకరమైన కారణం ఉన్నది . బిగ్‌ బాస్‌ హౌజ్‌లో శివాజీ బ్యాచ్‌లో ఉండే కంటెస్టెంట్స్‌లో ప్రిన్స్‌ కూడా ఒకరు. పైగా పల్లవి ప్రశాంత్‌ కూడా ఈ బ్యాచ్‌లోనే ఉంటాడు. అయితే 11 వారంలో శివాజీ, పల్లవి ప్రశాంత్‌ నామినేషన్స్‌లో లేకపోవడంతో వాళ్ల ఓట్లన్నీ ప్రిన్స్‌ యావర్‌కే పడుతున్నట్లు తెలుస్తుంది . అందుకే ఓటింగ్‌లో జెట్‌ స్పీడ్‌లో దూసుకెళుతున్నాడు ప్రిన్స్‌ .

ఎవరు ఎలిమినేట్‌ అవుతారో టెన్షన్‌ పెరిగింది
Bigg Boss

ఇక 11 వారం ఓటింగ్‌లో సీరియల్ బ్యాచ్‌ లీడర్‌ అమర్‌ దీప్‌ చౌదరి గారు రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి 20 శాతం ఓట్లు పోలయ్యాయి. 13 శాతం ఓట్లతో రతికా రోజ్‌ మూడో స్థానంలో ఉండగా, 8 శాతం ఓట్లతో అశ్విని శ్రీ నాలుగో ప్లేస్‌లో కొనసాగుతుంది . నిన్నటి వరకు అట్టడుగున ఉన్న ప్రియాంక జైన్‌ ఇప్పుడు ఐదో ప్లేస్‌కు వచ్చేసింది . ఆమెకు 6.8 శాతం ఓట్లు పడ్డాయి. అలాగే హౌజ్‌లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా పేరున్న అర్జున్‌ అంబటి 6.1 శాతం ఓట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే గౌతమ్‌ కృష్ణ ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక కేవలం 4 శాతం ఓట్లతో మోనితా శోభాశెట్టి ఆఖరి స్థానంలో ఉన్నది . అంటే ప్రస్తుతం గౌతమ్‌, శోభా శెట్టి డేంజర్‌ జోన్‌లో ఉన్నారన్నమాట. శుక్రవారం రాత్రి వరకు ఈ ఓటింగ్ జరగనున్నది . మరి అప్పటివరకు ఏమైనా మార్పులు జరుగుతాయా? లేదా? అన్నది తెలియాల్సి ఉన్నది .