తిరుమలకు ఎలాంటి అలర్ట్‌లు లేవు 

thirumala-have-no-alerts

తిరుపతి, తిరుమలకు ఎలాంటి అలర్ట్‌లు లేవని అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌ పేర్కొన్నారు. తిరుపతిలో రెడ్‌ అలర్ట్‌ అనేది ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్బన్‌ జిల్లా పరిధిలో అప్రమత్తంగా ఉన్నామన్నారు.

సాధారణ తనిఖీల్లో భాగంగానే వాహనాలను తనిఖీలు చేస్తున్నామన్నారు. నగరంలో 800 సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయన్నారు. తిరుపతి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

పటిష్ట భద్రతా ఏర్పాట్లు ఉన్న పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణమని, భక్తులు ఎటువంటి ఆందోళన చెందకుండా నిర్భయంగా స్వామి వారి దర్శనానికి తరలిరావాలని కోరారు.

తమిళనాడులో ఉగ్రవాదులు ప్రవేశించారన్న వార్తల నేపథ్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి, తిరుమలకు ఎలాంటి ఉగ్ర హెచ్చరికలు లేవని, భక్తులు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు.