సీఎం కుమారుడికి బెదిరింపులు

సీఎం కుమారుడికి బెదిరింపులు

మహారాష్ట్ర సీఎం కుమారుడు, పర్యాటక– పర్యావరణ మంత్రి అయిన ఆదిత్య ఠాక్రేను బెదిరించిన కేసులో ముంబై పోలీసులు గురువారం బెంగళూరులో ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన వ్యక్తి జైసింగ్‌ రాజపుత్‌గా గుర్తించారు. ఇతడిని ముంబై క్రైం బ్రాంచ్‌ సైబర్‌ విభాగం పోలీసులు అరెస్ట్‌చేసి ముంబైకి తీసుకెళ్లారు.

కాగా ఈ నెల 8వ తేదీన మంత్రికి జైసింగ్‌ ఫోన్‌ చేశాడు. మంత్రి ఫోన్‌ తీయకపోవడంతో రాజపుత్‌ ప్రాణహాని బెదిరింపులతో మళ్లీ మెసేజ్‌ పంపించాడు. ఈ నేపథ్యంలో నిందితున్ని గురువారం అరెస్ట్‌ చేశారు. గతంలో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌కు ఇతడు అభిమాని అని, ఆ ఘటనకు సంబంధించి బెదిరింపు సందేశాలను పంపినట్లు తెలిసింది.